భారీగా తగ్గిన వెండి ధర
- October 04, 2019గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉంటోంది. కాగా.. పసిడి ధరతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో.. 58 వేల బెంజ్ మార్క్ని దాటింది. దీంతో.. వెండి వైపు చూడమే మానేశారు ప్రజలు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరింత పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. అనుకోని విధంగా.. శుక్రవారం వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ. . ఏకంగా 2,300 రూపాయలు తగ్గి.. 45,750కి చేరింది వెండి. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. వెండి ధరలు తగ్గుతూ ఉంటే.. బంగారం మాత్రం రూ.900లు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల, 10 గ్రాములు రూ. 39,200లకు చేరింది. అలాగే.. 22 క్యారెట్ల .. 10 గ్రాముల బంగారు ఆభరణాల ధర 36,500లుగా మార్కెట్లో పలుకుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు