అక్టోబర్ 6న యస్వీరంగారావు విగ్రహావిష్కరణ
- October 04, 2019ఈ నెల 6న తాడేపల్లి గూడెంలో ఈ నెల 6న విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానునున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ ఆగస్టులోనే జరగాలి. కానీ, ప్రభుత్వం అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దసరా కానుకగా యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు మెగా అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
కార్యక్రమం డేటుకి సంబంధించిన ఫోస్టర్ ని విడుదల చేశారు. ఐతె, ఇది సైరా ప్రమోషన్స్ స్టంట్ అనే విమర్షలు కూడా వస్తున్నాయి. వాటిని మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు. ఇక ఈ నెల 6న చిరంజీవి వస్తున్నాడని తెలిసి ఉభయగోదావరిలోని మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభించనుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన