విజయవాడ విమానాశ్రయం నుంచే మక్కా,మదీనాకు విమానాలు
- October 05, 2019
అమరావతి:రాష్ట్రం నుంచి మక్కా, మదీనా వెళ్లే హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే వీరు సౌదీ అరేబియాలోని పవిత్ర క్షేత్రాలకు వెళ్లి రావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి విమానాల్లో హజ్ యాత్రకు వెళుతున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కూడా ఇందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని గతంలో కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. స్థానిక విమానాశ్రయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ఇద సాధ్యం కాదని అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు అన్ని మౌలిక వసతులు ఏర్పాటవడంతో వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'ఇంటర్నేషనల్ హజ్ ఎంబార్కేషన్ చెక్ పాయింట్' హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ ఉన్నతాధికారులకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందింది. దేశంలో ఇప్పటి వరకు 21 విమానాశ్రయాలకు మాత్రమే ఈ హోదా ఉంది. తాజాగా విజయవాడ ఎయిర్పోర్టు ఈ జాబితాలో చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..