ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త....

- October 12, 2019 , by Maagulf
ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త....

ఆంధ్రప్రదేశ్లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. స్థానికత కోటా పరంగా మరో రెండేళ్లు పొడిగించినట్లు తెలిపింది. అయితే తెలంగాణ నుంచిఆంధ్రప్రదేశ్ కి వచ్చే వారికి జూన్ 2 , 2021 వరకూ స్థానికతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనితో విద్యా ఉద్యోగాల్లో మరో రెండేళ్లవరకూ స్థానికత పొందే అవకాశం లభిస్తుంది. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో జారీ చేయబోతోంది.

కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోమ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం నవ్యాంధ్ర ఏర్పడిన 2004 జూన్ 2 నుంచి ఏడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి అవకాశముంటుంది.

కానీ రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయిన తర్వాతా ఇప్పటికీ వివిధ పోలీసు కేడర్‌తో పాటు, షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజన అంశం కొలిక్కి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది హైదారబాద్‌తో పాటు తెలంగాణలోనే ఉంటున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇంకా సయమం పట్టే అవకాశం ఉన్నందున చాలామంది సందిగ్ధంలోనే ఉన్నారు.

అయితే దీనితో ఈ ఏడాది జూన్ 2 తో ముగిసిన గడువును మరో రెండేళ్ల పాటు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో దాన్ని 2019 జూన్ వరకు పొడిగించారు. కానీ ఇప్పుడు తాజాగా మరో రెండేళ్లు పెంచారు కేంద్రం పాలకులు. దీని ప్రకారం జూన్ 2, 2021 లోపు తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చి ఏ ప్రాంతంలో స్థిరపడితే ఆ స్థానికతను కల్పించే విద్యా, ఉద్యోగవాకాశాల్లో అందుకు తగ్గ ప్రాధాన్యం ఇస్తారు అని కేంద్రం ఈ సందర్బంగా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com