సౌదీ అరేబియా లో ఏ.పి వాసి హత్య
- October 13, 2019సౌదీ అరేబియాలో విశాఖపట్నం కు చెందిన సేల్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న అబ్దుల్ అయాజ్(54)అల్ ఖర్మ లో హత్యకు గురయ్యారని, అయితే మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని అయాజ్ కుమార్తె సమీనా షేక్ చేసిన ట్వీట్తో యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ జాప్యంపై సమీనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ట్వీట్ చేయటంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు విశాఖ పోలీసులు వీరి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఈ కుటుంబ వివరాల కోసం విశాఖపట్నం లో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. సమీనా కూడా ఈ సంఘటనపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో చిరునామా తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే బాధిత కుటుంబం దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారులు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!