షార్జా:రక్తపు మడుగులో ఆసియా మహిళ

- October 18, 2019 , by Maagulf
షార్జా:రక్తపు మడుగులో ఆసియా మహిళ

షార్జా పోలీసులు, 29 ఏళ్ళ పాకిస్తానీ మహిళ మృతి కేసుని పబ్లిక ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు. షార్జాలోని మువైలా ప్రాంతంలో పాకిస్తానీ మహిళ మృతి చెందారు. రక్తపు మడుగులో ఆమెను ఆమె ఇంట్లో కనుగొన్నారు పోలీసులు. అక్టోబర్‌ 10న ఈ ఘటన జరిగింది. మృతురాలితోపాటు, పాకిస్తాన్‌కే చెందిన మరికొందరు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ప్‌ నైఫ్‌తో ఆమె నరాల్ని కోసి వేసి వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె మరణానికి సంబంధించి పూర్తి కారణాలు తెలిసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెతోపాటు అదే ఇంట్లో వుంటోన్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com