నిలిచిపోయిన ఏపీ బస్సు సర్వీసులు
- October 19, 2019విజయవాడ : తెలంగాణ బంద్ నేపధ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు ఆపేశామని డీసీటీఎం మూర్తి తెలిపారు. బంద్ వల్ల ప్రయాణికులు సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తెలంగాణ లో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటం వల్ల ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సర్వీసులు రద్దు చేశామన్నారు. వీకెండ్ కావడంతో సంస్థకు కూడా నష్టం జరిగిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం మరోసారి తమ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు