పాకిస్తాన్ రైలులో మంటలు..షుమారు 60మంది సజీవ దహనం
- October 31, 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్గామ్ ఎక్స్ప్రెస్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో
షుమారు 60మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తల్వారీ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత లియాఖత్పూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు ఏకంగా మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!