నేడు బ్రహ్మానందం చేతుల మీదుగా 'బిర్యానీస్ అండ్ మోర్' రెస్టారెంట్ ప్రారంభం
- October 31, 2019
దుబాయ్:ప్రముఖ సినీ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం, దుబాయ్లో బిర్యానీస్ అండ్ మోర్ బ్రాంచ్ని ప్రారంభిస్తున్నారు. అక్టోబర్ 31న సాయంం 6 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభమవుతుంది. దుబాయ్లోని అల్ నహ్దా 1 ప్రాంతంలో, ఇఎన్ఓసి పెట్రోల్ స్టేషన్ సమీపంలో హాబ్టూర్ బిల్డింగ్లో ఈ బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మంది సౌకర్యంగా కూర్చునేందుకు వీలుగా రెస్టారెంట్ని తీర్చిదిద్దామని ఫ్రాంఛైజీ ఓనర్ రషీద్ మొహమ్మదాలి చెప్పారు. తమకు ఇండియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరియు యూఏఈలో పలు చెయిన్స్ ఆఫ్ రెస్టారెంట్స్ వున్నాయని ఆయన వివరించారు. దుబాయ్లో కొత్తగా ఓపెన్ చేస్తోన్న రెస్టారెంట్లో 200కి పైగా డిషెస్ ఆహార ప్రియుల కోసం అందుబాటులో వుంటాయని తెలిపారాయన. నాన్ వెజ్తోపాటు వెజిటేరియన్ బిర్యానీలోనూ అనేక రకాలు అందుబాటులో వుంటాయి. ఒక్క నాన్ వెజ్ విభాగంలోనే 20కి పైగా వెరైటీలు తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కేటరింగ్ సౌకర్యం అలాగే యాంపిల్ పార్కింగ్ స్పేస్, చిన్న చిన్న పార్టీలూ.. వంటి ప్రత్యేకతలు తమ సొంతమని నిర్వాహకులు వివరించారు. మరిన్ని వివరాలకు www.biryanis.com
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?