దుబాయ్ ప్రయాణికుడి కొత్త గోల్డ్ ప్లాన్...
- November 01, 2019
శంషాబాద్: విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొస్తున్న 662 గ్రాముల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తీసుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. షేక్ పరియాజ్ అనే ప్రయాణికుడిని స్కానింగ్ చేయగా అతడి కడుపులో బంగారం ఉన్నట్లు తేలింది. పెద్ద పేగులో ప్లాస్టిక్ ట్యూబ్లు ఉన్నాయి. వాటిల్లో బంగారం పెట్టాడు. పసిడితోపాటు లక్ష రూపాయల విలువగల ఐఫోన్, 72 వేల బురఖాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారాన్ని పేస్టుగా మార్చి చిన్న చిన్న ప్లాస్టిక్ ట్యూబుల్లో నింపి తీసుకొచ్చాడు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!