కువైట్ లో ఏ.పి వాసి మృతి
- November 03, 2019
కువైట్:కువైట్ వెళ్లిన రాజంపేటలోని నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ(34) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. రఫీ కొన్నేళ్లుగా కువైట్లో సీసీటీవీ కెమెరాల టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 19న జాబిరియా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో కెమెరా బిగిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెనపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28న రఫీ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు సేవాదళ్ ఇన్చార్జి గోవిందు రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్ఆర్టీ కార్పొరేషన్ వారు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!