నవంబర్ నెలఖారున ధనుష్ కొత్త చిత్రం విడుదల!

- November 04, 2019 , by Maagulf
నవంబర్ నెలఖారున ధనుష్ కొత్త చిత్రం విడుదల!

ధనుష్‌, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌మేనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ధనుష్‌ అభిమానులు మాత్రం చిత్రం విడుదలపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. కారణం.. ఈ చిత్రం ఇప్పటివరకు పలు దఫాలు వాయిదాపడడమే. షూటింగ్‌ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక సమస్యల కారణంగా తెరవెనుకే ఉండిపోయింది. ధనుష్‌ తాజా చిత్రం 'అసురన్‌' అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా'ను విడుదల చేసేందుకు గౌతమ్‌మేనన్‌, నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రకారం నవంబర్‌ నెలాఖరున ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈసారైనా మిస్సవకుండా ఈ చిత్రం థియేటర్లలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com