షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి
- November 05, 2019
షార్జా:దురదృష్టవశాత్తూ భారత మహిళ ఒకరు షార్జాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. టీనేజర్ అయిన తన కుమారుడి కారణంగానే ఆమె మృతి చెందడం మరింత బాధాకరం. కువైలాహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫోర్ వీల్ డ్రైవ్ కారుని పార్క్ చేసే సమయంలో బ్రేక్ వేయాల్సింది పోయి, 17 ఏళ్ళ టీనేజర్, యాక్సెలరేటర్ బలంగా నొక్కడంతో ఆ కారు ముందున్న మహిళపైకి కారు దూసుకుపోయింది. ఆ ఘటన సమయంలో ఆమె పార్క్ బయట కూర్చుని వున్నారు. ఈ కేసుకి సంబంధించి టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్ ఆఫీసర్స్, అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని ధృవీకరించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!