అయోధ్య తీర్పు: అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసిన కేంద్రం
- November 07, 2019
న్యూఢిల్లీ : చారిత్రాత్మకమైన అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. భద్రతాపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అంతేకాకుండా సున్నితమైన ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఆయా రాష్ట్రాల్లో ఈ తీర్పుపై ఎలాంటి గొడవలు చలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 4,000 పారామిలటరీ బలగాలను తలరించి, పరిస్థితిని సమీక్షిస్తోంది.
అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అధికారులకు సెలవులను కూడా రద్దు చేసి, అందరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. ఇక, కొన్ని ముస్లిం సంఘాలు కూడా స్పందిస్తూ... సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో ఎలాంటి తీర్పునిచ్చినా తమకు శిరోధార్యమేనని బుధవారం ప్రకటించాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?