అయోధ్య తీర్పు: అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసిన కేంద్రం
- November 07, 2019
న్యూఢిల్లీ : చారిత్రాత్మకమైన అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. భద్రతాపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అంతేకాకుండా సున్నితమైన ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఆయా రాష్ట్రాల్లో ఈ తీర్పుపై ఎలాంటి గొడవలు చలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 4,000 పారామిలటరీ బలగాలను తలరించి, పరిస్థితిని సమీక్షిస్తోంది.
అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అధికారులకు సెలవులను కూడా రద్దు చేసి, అందరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. ఇక, కొన్ని ముస్లిం సంఘాలు కూడా స్పందిస్తూ... సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో ఎలాంటి తీర్పునిచ్చినా తమకు శిరోధార్యమేనని బుధవారం ప్రకటించాయి.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







