వీల్‌ ఛెయిర్‌పై దుబాయ్‌ రన్‌ చేసిన సీనియర్‌ సిటిజన్స్‌

- November 09, 2019 , by Maagulf
వీల్‌ ఛెయిర్‌పై దుబాయ్‌ రన్‌ చేసిన సీనియర్‌ సిటిజన్స్‌

శుక్రవారం జరిగిన దుబాయ్‌ రన్‌లో యువకులే కాదు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 86 ఏళ్ళ భారత మహిళ కుసుమ్‌ భార్గవ, వీల్‌ ఛెయిర్‌పై పరుగులో పాల్గొనడం గమనార్హం. ఇది చాలా గొప్ప అనుభూతి అనీ, చాలామందిని తాను కలుసుకున్నానని ఆమె చెప్పారు. వీల్‌ ఛెయిర్‌పై 5 కిలోమీటర్ల రన్‌ని ఆమె పూర్తి చేశారు. 78 ఏళ్ళ ఈశ్వరి అమ్మ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 5 కిలోమీటర్ల రన్‌లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వీల్‌ ఛెయిర్‌పై నడిపించారు. తన కుమారుడు దుబాయ్‌లోని అద్భుతమైన కట్టడాల్ని చూపించేవాడనీ, ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి రోడ్డుపై చూస్తున్నానని ఆమె అన్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com