కువైట్: పరువు తీసిన టిక్ టాక్ వీడియో..మనస్తాపంతో ఉరి
- November 10, 2019ఏ.పి: తన పై ఆరోపణలు చేస్తూ,వేరోక వ్యక్తి టిక్ టాక్ లో విడియో చేసి దానిని వైరల్ చేయడంతో మనస్తాపం కు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజోలు మండలం శివకోటి పోస్టాఫీసు వీధి కి చెందిన పుచ్చకాయల మోహన కుమార్ (30)ఉపాధి నిమిత్తం కువైట్ దేశం వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటి వద్ద ఉన్న వాళ్ళ అమ్మ కు డబ్బులు పంపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా 2 వేల రూపాయల కువైట్ డబ్బులు దినర్లు చీటిపాడుకుని కనిపించకుండా పరారిలో ఉన్నాడని తన స్నేహితుడు వడ్డి దుర్గారావు టిక్ టాక్ లో మోహన్ కుమార్ ఫోటోలతో విడియో క్రియేట్ చేసి టిక్ టాక్ లో పెట్టడంతో పరువు పోయిందని మనస్తాపం కు గురైన మోహన్ ఈ నెల 3 వ తేదిన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియన్ ఎంబసీ వారు కువైట్ ఎంబసీ తో మాట్లాడి మోహన్ మృతదేహాన్ని ఇండియా కు రప్పిస్తున్నారు. ఉపాధి కొసం వెళ్ళిన తన కొడుకు ఇలా మృతదేహం గా రావడంతో మృతుని తల్లి విజయ కుమారి విలపిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. దీంతో శివకోటి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!