ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు
- January 12, 2016
గల్ఫ్ దేశాల సమాఖ్యలొ ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు, శాశ్వత మార్గదర్శకాలు ఇకపై రూపొందుతున్నాయి. ఇవి ఏప్రిల్ నుంచి సమర్దవంతంగా అమలు కానున్నట్లు పారిశ్రామిక , వాణిజ్య మొన అల్ అలవి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో ద్విచక్రవాహనాలను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక వారికిష్టమైన రీతులలో కొనసాగించడానికి వీలు లేదు. వివిధ మోడల్ మోటార్ బైకులను పలు రకాలైన టైర్లతో రూపొందించడంలో ప్రామాణికాలను, కొలతల గూర్చి గల్ఫ్ దేశాల సమాఖ్య అనుకూలిత ద్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గతంలో, ఇదే తరహ ప్రయోగాన్ని కార్లు , కార్గో ట్రక్కులు , టైర్ల ఉత్పతులు భద్రత భరోసా విషయమై 2005 లో చేసి భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఇదే విధానాన్ని ద్విచక్రవాహనదారులకు ఈ ఏకీకృత నిబంధనలు అమలులోనికి రానున్నాయి. గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో వారికి ఇచ్చే అనుకూలత సర్టిఫికేట్ ఆమోదయోగ్యంగా ఉంటుంది. భద్రత , అనుకూలత నిర్ధారణ లేని ద్విచక్రవాహనాలను ఎగుమతి చేయకుండా నివారించేందుకు ఈ చర్య ఎంతగానోఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాల సమాఖ్య సాంకేతిక నిబంధనలు తయారీదారుల ఆచరణకు వీలుగా ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







