ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు
- January 12, 2016
గల్ఫ్ దేశాల సమాఖ్యలొ ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు, శాశ్వత మార్గదర్శకాలు ఇకపై రూపొందుతున్నాయి. ఇవి ఏప్రిల్ నుంచి సమర్దవంతంగా అమలు కానున్నట్లు పారిశ్రామిక , వాణిజ్య మొన అల్ అలవి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో ద్విచక్రవాహనాలను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక వారికిష్టమైన రీతులలో కొనసాగించడానికి వీలు లేదు. వివిధ మోడల్ మోటార్ బైకులను పలు రకాలైన టైర్లతో రూపొందించడంలో ప్రామాణికాలను, కొలతల గూర్చి గల్ఫ్ దేశాల సమాఖ్య అనుకూలిత ద్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గతంలో, ఇదే తరహ ప్రయోగాన్ని కార్లు , కార్గో ట్రక్కులు , టైర్ల ఉత్పతులు భద్రత భరోసా విషయమై 2005 లో చేసి భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఇదే విధానాన్ని ద్విచక్రవాహనదారులకు ఈ ఏకీకృత నిబంధనలు అమలులోనికి రానున్నాయి. గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో వారికి ఇచ్చే అనుకూలత సర్టిఫికేట్ ఆమోదయోగ్యంగా ఉంటుంది. భద్రత , అనుకూలత నిర్ధారణ లేని ద్విచక్రవాహనాలను ఎగుమతి చేయకుండా నివారించేందుకు ఈ చర్య ఎంతగానోఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాల సమాఖ్య సాంకేతిక నిబంధనలు తయారీదారుల ఆచరణకు వీలుగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







