మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న నాసా
- November 12, 2019వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయోగాలు కొలిక్కివచ్చాయి. విద్యుత్ ఇంధనంతో నడిచేలా నాసా రూపొందించిన విమానం త్వరలో గాల్లోకి ఎగరనుందని సంస్థ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్ ప్రయోగశాలలో పరీక్షించామని, ఫలితం సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. ఏడాది కాలంలోపు ఎడ్వర్డ్ వైమానిక దళ బేస్ నుంచి ఇది గాల్లోకి ఎగురుతుందని పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్వెల్ 'ఎక్స్57' అని పేరు పెట్టింది. 2015లో తయారీ ప్రారంభమైన ఈ విమానాన్ని ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బ్రెంట్ కోబ్లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్ ఇంధన ఆధారిత విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నప్పటికీ నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్ తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం