ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దాటిన గండం
- November 13, 2019హాంకాంగ్: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత తొలిరౌండ్ గండాన్ని దాటింది. హాంకాంగ్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకుంది. ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గా ఉన్ (ద.కొరియా)పై 21-15, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ఆటను ముగించింది. తర్వాతి రౌండ్లో థాయ్ల్యాండ్ అమ్మాయి బుసానన్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. అంతకు ముందు సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రెండు గేముల్లోనూ సింధు ఆధిపత్యం చెలాయించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్ స్వల్ప విరామానికి ముందు 11-10తో సింధును వెనక్కినెట్టింది. 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో భారత షట్లర్ విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్ గెలిచింది. రెండో గేమ్ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా గెలిచింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ