మోడీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే బినామీలు బట్టబయలు
- November 17, 2019ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా బినామీల ఆస్తుల లావాదేవీలను అడ్డుకోవడానికి ఒక సరికొత్త చట్టాన్ని తీసుకురావడానికి మోదీ నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలోని స్థిరాస్తుల కొనుగోలు ,అమ్మకాలను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తుంది. ఈ ప్రక్రియ తుదిధశకు చేరింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాలిస్తే మాత్రం బినామీలు బట్టబయలు అవుతారని భావిస్తున్నారు.
అంతేకాకుండా భూముల,ఇండ్ల ధరలు నేలకు దిగుతాయని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఈ నిర్ణయం ఎంతవరకు అమలు అవుతుందో..?. ఎంతవరకు విజయవంతమవుతుందో..?.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?