కమలహాసన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
- November 19, 2019
ఒడిశా: ప్రముఖ సినీనటుడు కమలహాసన్ కు ఒడిశాలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా కమల్ ఈ రోజు ఈ డాక్టరేట్ అందుకున్నారు. బాల్యంలోనే నట జీవితాన్ని ప్రారంభించిన కమలహాసన్ ఇటీవల సినీ జీవితంలో 60 వసంతాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తన నటనకు గానూ ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. కమల్ విశిష్ట నటుడిగా మాత్రమే కాకుండా.. మంచి కథకుడిగా, స్కీన్ర్ ప్లే రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగానూ రాణించారు. 1980, 90ల్లో వచ్చిన కమల్ సినిమాలు ఆయనలోని అసాధారణ నటనను బయటపెట్టాయి. ఇప్పటికీ ఆయన విభిన్న పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. గతంలో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కూడా కమల్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..