భారత్ కు మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
- November 21, 2019న్యూఢిల్లీ: భారత్ చేతికి ఇప్పటి వరకూ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత వాయు సేన సిబ్బందికి (ఐఏఎఫ్) ఫ్రాన్స్లో శిక్షణ అందుతోందని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం చెప్పారు. తొలి విమానాన్ని రాజ్నాథ్ అక్టోబర్ 8న స్వీకరించారు. రాఫెల్ విమానాలను ఫ్రాన్స్లోని డసోల్ట్ ఏవియేషన్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ అందుకున్న 3 విమానాల్లో చివరి రెండు ఎప్పుడు అందుకున్నదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో కేంద్ర ప్రభుత్వం 2016లో దాదాపు రూ.59 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్కు చెందిన 4 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మే నెలలో మన దేశానికి రానున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..