'పండగ' సినిమా షూటింగ్ పూర్తి
- November 30, 2019మారుతి దర్శకత్వంలో సాయి తేజ్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాత-మనవళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి కానుంది.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. నేటితో ఆ పాట షూటింగ్ పూర్తికానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 'ఈరోజు చిత్రంలోని చివరి పాటను రూపొందిస్తున్నాం. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 20న మీ ముందుకొస్తున్నాం. అనుకున్న సమయానికి, అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం. ప్రతిరోజూ పండగే కుటుంబ కథా చిత్రం. వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా సందేశం ఉంటుంది' అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ