యూఏఈలో భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
- December 10, 2019
యూఏఈలో రెండేళ్ల చిన్నారి భవనంపై నుంచి పడి మృతి చెందింది. షార్జాలోని అల్ మజాస్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ అపార్ట్మెంట్లో గత కొన్నాళ్లుగా సిరియన్ కుటుంబం నివసిస్తోంది. ఫ్లాట్ ఉన్న 8వ ఫ్లోర్ నుంచి రెండేళ్ల పసిపాప కిందపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పాట్రోల్స్ & పారామెడిక్స్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అల్ బుహైర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









