దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ
- December 11, 2019దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఈ నెల 12వ తేదీన దుబాయ్ లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు. రాణీ నటించిన తాజాగా చిత్రం 'మర్దానీ 2' విడుదల సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె దుబాయ్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు రాణీ ముఖర్జీకి లా మెర్లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డీరా సిటీ సెంటర్లోని వోక్స్ సినిమాస్లో దుబాయ్ పోలీసుల కోసం ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేసింది.
2014లో విడుదలైన 'మర్దానీ'కి సీక్వెల్గా వస్తున్న 'మర్దానీ 2' ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు సూపరింటెండెంట్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే విడుదలైన 'మర్దానీ 2' ట్రైలర్ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు