దుబాయ్: ఇండియన్ స్కూల్ సీఈవో మార్పు
- December 13, 2019దుబాయ్ లోని ఇండియన్ హైస్కూల్ తన సీఈఓను మార్చుతూ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సుదీర్ఘకాలంగా సీఈఓ పదవిలో కొనసాగుతున్న అశోక్ కుమార్ స్థానంలో ఎం.కే. వాసు పునీత్ ను కొత్త సీఈఓ నియమించబడ్డారు. దీనికి సంబంధించి విద్యార్ధుల తల్లిదండ్రులకు స్కూల్ మేనేజ్ మెంట్ గురువారం మేసేజ్ పించింది. ఇటీవలె స్కూల్ చైర్మన్ గా నియమింపబడిన గిరిష్ జెత్వాని మాట్లాడుతూ కుమార్ సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారని ప్రకటించారు. అయితే..ఇందుకు గల కారణలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కొత్త సీఈఓ వాసు స్కూల్ పూర్వ విద్యార్ధి కావటం విశేషం.
23 ఏళ్ల పాటు స్కూల్ సీఈఓ బాధ్యతలు నిర్వహించిన కుమార్..ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. విద్యార్ధుల కోసం ఆయన చేసిన క్రుషికిగాను అవార్డు అందుకున్న విద్యావేత కుమార్..స్కూల్ అకాడమీ బుక్స్ రచించారు. విద్యావేతగా ఎన్నో కీలక పదవులు చేపట్టారు. కంటెంట్ అడ్వైజర్ - వాట్ వర్క్స్ (నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ, దుబాయ్), ఇంటర్నేషనల్ అసోసియేట్ ఇన్స్పెక్టర్, గ్రేటర్ గుడ్ సర్కిల్ సభ్యుడు, గల్ఫ్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ఇలా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. GESS ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2019 లో “లైఫ్ టైం అచీవ్మెంట్” పురస్కారం అందుకున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు