ఐఎస్‌బి మెగా ఫెయిర్‌ 2019 ప్రారంభం: వర్షం కారణంగా షోస్‌ పోస్ట్‌పోన్డ్‌

- December 16, 2019 , by Maagulf
ఐఎస్‌బి మెగా ఫెయిర్‌ 2019 ప్రారంభం: వర్షం కారణంగా షోస్‌ పోస్ట్‌పోన్డ్‌

ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌ (ఐఎస్‌బి) మెగా ఫెయిర్‌ 2019, ఇసా టౌన్‌లోని స్కూల్‌ గ్రౌండ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే, వర్షం కారణంగా షోస్‌ వాయిదా పడ్డాయి. చీఫ్‌ గెస్ట్‌గా ఇండియన్‌ అంబాసిడర్‌ అలోక్‌ కుమార్‌ సిన్హా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల మెగా ఫెయిర్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ మరియు ఫుడ్‌ ఫెస్టివల్‌ ఐఎస్‌బి ఛైర్మన్‌ ప్రిన్స్‌ ఎస్‌ నటరాజన్‌, సెక్రెటరీ సాజి ఆంటోనీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌, ప్రిన్సిపల్‌ విఆర్‌ పలనిసామి, రిఫ్ఫా క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ పమేలా గ్జేవియర్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ జనరల్‌ కన్వీనర్‌ ఆర్‌ రమేష్‌ నేతృత్వంలో సాగాయి. స్టీఫెన్‌ దేవాస్సీ సంగీత కార్మక్రమం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వర్షం సోమవారం కూడా కొనసాగినా, ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com