మృత శిశువును చెత్తకుప్పలో పడేసిన తల్లికి 6 నెలల జైలు శిక్ష
- December 20, 2019
దుబాయ్:అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పలో పడేసిన కేసులో తల్లికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది దుబాయ్ కోర్టు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇల్లీగల్ అఫైర్ వల్లే ఈ దారుణానికి ఓడిగట్టినట్లు రుజువు కావటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిలిపినాకు చెందిన 35 ఏళ్ల
మహిళ ఫిలిపిన, పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కొన్నాళ్లుగా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. ఫలితంగా ప్రెగ్నెన్స్ రావటంతో మృతిచెందిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ముగ్గురు కలిసి బేబి డెడ్ బాడీని ప్యాక్ చేసి అల్ బరాహా ప్రాంతంలోని చెత్తకుప్పలో పడేశారు.
అయితే..చెత్తకుప్పలో చిన్నారి డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 38 ఏళ్ల పాకిస్తానీ బేబీని చెత్తకుప్పలో వేసినట్లు నిర్ధారించుకొని అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయటంతో అసలు విషయం బయటపడింది. చిన్నారి డెడ్ బాడీని ప్యాక్ చేసి ఇచ్చిన 50 ఏళ్ల ఫిలిపిన వ్యక్తితో పాటు ఆ
తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ తల్లి కూడా నిజాలను ఒప్పుకుంది. దీంతో దుబాయ్ కోర్టు తల్లికి ఆరు నెలల జైలు శిక్ష..ఆమెకు సహకరించిన పాకిస్తానీ, ఫిలిపిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు...ఫిలిపినకు చెందిన ఇద్దరి వీసా ఎక్స్ పైర్ కావటంతో ఆ ఇద్దరికి అదనంగా మరో నెల జైలు శిక్షను ఖరారు
చేసింది కోర్టు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!