దుబాయ్ లో చిక్కుకున్న మావాళ్లను రప్పించండి

- December 23, 2019 , by Maagulf
దుబాయ్ లో చిక్కుకున్న మావాళ్లను రప్పించండి

తెలంగాణ:జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామానికి చెందిన నలువాల పోషయ్య, జెల్ల మల్లయ్య అనే ఇద్దరు వలస కార్మికులు యూ.ఏ.ఈ దేశంలోని దుబాయ్ లో చిక్కుకున్నారని వారిని స్వదేశానికి రప్పించాలని వారి కుమారులు  సోమవారం  (23.12.2019)న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. 

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మ్యాడవరం నాగభూషణం లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
దుబాయ్ కి అక్రమంగా దేశ సరిహద్దు దాటడం వలన స్వదేశం రావడానికి ఇబ్బందిగా ఉన్నదని,దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వారు తాత్కాలిక పాస్ పోర్టులు జారీ చేయాలని వారు కోరారు. 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com