ఇండియా:జనవరి 1 నుంచి పెన్షనర్లకు శుభవార్త..

- December 28, 2019 , by Maagulf
ఇండియా:జనవరి 1 నుంచి పెన్షనర్లకు శుభవార్త..

ఇండియా:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ కమ్యూటేషన్ లేదా అడ్వాన్స్ పార్ట్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను మళ్లీ తీసుకురావాలని ఈపీఎఫ్‌వో గతంలో నిర్ణయించింది. తాజాగా కార్మిక శాఖ దాని అమలుకు ఓకే చెప్పడంతో జనవరి 1 నుంచి ఈ ప్రయోజనం మళ్లీ అందుబాటులోకి రానుంది. 2009కి ముందు వరకు ఈ ఆప్షన్ ఉంది. మధ్యలో కొంత కాలం ఈ ఆప్షన్‌ను కార్మిక శాఖ వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి రానుంది.

రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి స్థాయి పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తుందనుకుంటే.. కమ్యూటేషన్ పద్దతిలో అయితే రూ.29.000 వస్తుంది. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే పెన్షన్ పూర్తి విలువను 15 ఏళ్ల తరువాత పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com