ప్రవాస భారతీయులకు అలర్ట్:డిసెంబర్ 31లోగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయాల్సిందే

- December 28, 2019 , by Maagulf
ప్రవాస భారతీయులకు అలర్ట్:డిసెంబర్ 31లోగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయాల్సిందే

బ్యాంకు లావాదేవీలు నిర్వహించే ప్రతీ ఒక్కరు పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకునేందుకు డెడ్ లైన్ గడువు ముంచుకొస్తోంది. ప్రవాస భారతీయులు, ఇండియన్ పౌరులు ఈ నెల 31లోగా ఖచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సెంటల్ర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT(ఇండియా) సూచించింది. డెడ్ లైన్ లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే ఆ పాన్ కార్డును పని చేయనట్లుగానే భావిస్తామని CBDT హెచ్చరించింది.

భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఈ ఏడాది మార్చిలోనే ఆధార్ తో పాన్ కార్డు లింక్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం సవరణలు చేసింది. తొలుత మార్చి 31వరకు డెడ్ లైన్ విధించినా..గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఆ తర్వాత మరో అవకాశం కల్పిస్తూ డెడ్ లైన్ ని డిసెంబర్ 31వరకు ఎక్స్ టెండ్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com