పొగమంచు కారణంగా ఎదురెదురుగా ' ఢీ ' కొన్న 93 వాహనాలు - 23 మంది క్షతగాత్రులు
- January 16, 2016
దట్టమైన పొగమంచు పలు రోడ్డు ప్రమాదాలకి ముఖ్య కారణమైంది. ఎదురుగా వచ్చే వాహనాన్ని సమీపంలోనికి వచ్చేవరుకు వాహనాన్ని నడిపేవారు గుర్తించలేక పోవడంతో అబూధాబి రహదారిపై వివిధ వాహనాలు ' ఢీ ' కొని ఒక కుప్ప మాదిరీగా తయరయ్యయి. ఈ ప్రమాదాలలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమ్ఘ్హతన్ గూర్చిన సమాచారం తెలియగానే, ట్రాఫిక్ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని ఆయా వాహనాల ప్రక్షాళన చర్యలు చేపట్టారు. దీంతో మరికొన్ని ప్రమాదాలు జరగకుండా, నిలువరించగలిగెమని అబూధాబి పోలీస్ ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీఫా మొహమద్ ముబారక్ అల్ ఖిలే తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలలో తొలుత అల్ సద్స్వెఇహన్ వంతెన సమీపంలో ఐదు వాహనాలు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయి. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలో రెండవ ప్రమాదంలో 69 కార్లు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయి. 3 వ సంఘటనలో 8 కార్లు ఎదురెదురుగా గుద్దుకోన్నాయి. అలాగే నాల్గవ ప్రమాదం సైతం ఇదే మార్గంలో బుసంర వంతెన సమీపంలో 14 కార్లు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయని అంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రానున్నరోజులలో ఈ ప్రాంతాలలో దట్టమైన పొగమంచుతో పాటు వర్షాలు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాహనచోదకులు సరైన విపత్తు లైట్ లను ఉపయోగించకుండా మార్గసూచిలను పరిశీలించకుండా ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ప్రమాదమని సంబంధిత శాఖాదికార్లు వాహనదార్లను హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









