అబుదాబి:మంత్రాల పేరుతో బురిడికొట్టిస్తున్న ప్రవాసీయురాలి అరెస్ట్
- December 29, 2019
అబుదాబి:మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న మహిళను అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అజ్ణాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విదేశీ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన మంత్ర తంత్ర పూజలతో కుటుంబ సమస్యలు, మానసిక రోగాలు తొలగిపోతాయని ప్రవాసీయురాలు అమాయకులను నమ్మించేది. వారి నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసేది. సోషల్ మీడియా ద్వారా సమస్యల్లో ఉన్నవారిని ట్రాప్ చేసేది. ఆ తర్వాత అబుదాబిలోని తన అపార్ట్మెంట్ ఫ్లాట్ కు క్లైయింట్స్ ని రమ్మని పిలిపించుకొని..తన మంత్ర విద్యలతో మానసిక రోగాలు, ఫామిలి ప్రాబ్లమ్స్ ను మటుమాయం చేస్తానని చెప్పేది. అయితే..ప్రవాసీయురాలి మోసాలపై గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆపార్ట్మెంట్ కు వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరైనా మంత్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా మంత్రతంత్రాలను నమ్మొద్దని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







