అబుదాబి:మంత్రాల పేరుతో బురిడికొట్టిస్తున్న ప్రవాసీయురాలి అరెస్ట్
- December 29, 2019
అబుదాబి:మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న మహిళను అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అజ్ణాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విదేశీ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన మంత్ర తంత్ర పూజలతో కుటుంబ సమస్యలు, మానసిక రోగాలు తొలగిపోతాయని ప్రవాసీయురాలు అమాయకులను నమ్మించేది. వారి నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసేది. సోషల్ మీడియా ద్వారా సమస్యల్లో ఉన్నవారిని ట్రాప్ చేసేది. ఆ తర్వాత అబుదాబిలోని తన అపార్ట్మెంట్ ఫ్లాట్ కు క్లైయింట్స్ ని రమ్మని పిలిపించుకొని..తన మంత్ర విద్యలతో మానసిక రోగాలు, ఫామిలి ప్రాబ్లమ్స్ ను మటుమాయం చేస్తానని చెప్పేది. అయితే..ప్రవాసీయురాలి మోసాలపై గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆపార్ట్మెంట్ కు వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరైనా మంత్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా మంత్రతంత్రాలను నమ్మొద్దని సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







