శనివారాల్లో ఇకపై అందుబాటులో వుండని ముహరాక్ బ్రాంచ్ ఐడీ కార్డ్ సర్వీస్ సెంటర్
- January 03, 2020
మనామా: ఇన్ఫర్మేషన్ అండ్ ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), ఇకపై ముహరాక్లోని సీఫ్ మాల్లోని తమ బ్రాంచ్, ఇకపై శనివారాల్లో అందుబాటులో వుండదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు సాధారణంగానే ఇక్కడ సేవలు అందుతాయని ఐజిఎ పేర్కొంది. ఇప్పటిదాకా ఈ బ్రాంచ్లో శనివారం కూడా సేవలు అందుతున్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు శనివారం సేవల్ని నిలుపుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది ఐజిఎ. 2019 సెకెండ్ హాఫ్లో శనివారాల్లోనే 11,000కి పైగా ఐడీ చిప్ అప్డేటింగ్ రిక్వెస్ట్లను ప్రాసెస్ చేసినట్లు ఐజిఎ డైరెక్టర్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ పాపులేషన్ రిజిస్ట్రీ షేక్ సబాహ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. కాగా, జులై 13, 2019న ఐజిఎ, సీఫ్ మాల్ ముహారాక్, ఇసా టౌన్ ఐడీ సెంటర్స్ శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







