శనివారాల్లో ఇకపై అందుబాటులో వుండని ముహరాక్ బ్రాంచ్ ఐడీ కార్డ్ సర్వీస్ సెంటర్
- January 03, 2020
మనామా: ఇన్ఫర్మేషన్ అండ్ ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), ఇకపై ముహరాక్లోని సీఫ్ మాల్లోని తమ బ్రాంచ్, ఇకపై శనివారాల్లో అందుబాటులో వుండదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు సాధారణంగానే ఇక్కడ సేవలు అందుతాయని ఐజిఎ పేర్కొంది. ఇప్పటిదాకా ఈ బ్రాంచ్లో శనివారం కూడా సేవలు అందుతున్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు శనివారం సేవల్ని నిలుపుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది ఐజిఎ. 2019 సెకెండ్ హాఫ్లో శనివారాల్లోనే 11,000కి పైగా ఐడీ చిప్ అప్డేటింగ్ రిక్వెస్ట్లను ప్రాసెస్ చేసినట్లు ఐజిఎ డైరెక్టర్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ పాపులేషన్ రిజిస్ట్రీ షేక్ సబాహ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. కాగా, జులై 13, 2019న ఐజిఎ, సీఫ్ మాల్ ముహారాక్, ఇసా టౌన్ ఐడీ సెంటర్స్ శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







