ట్రంప్ నిర్ణయాలకు గల్ఫ్ లో యుద్ధవాతావరణం!
- January 05, 2020
ప్రస్తుతం గల్ఫ్ లో యుద్దవాతావరణం నెలకొన్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధ భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. గల్ఫ్ లో ఏ క్షణంలో అయినా యుద్ధం సంభవించే అవకాశం పుష్కలంగా ఉండటంతో ప్రపంచం యావత్తు భయపడుతున్నది. ముఖ్యంగా ఇండియా. ఎందుకంటే, ఇండియా ఎక్కువగా చమురును ఇరాన్, సౌదీ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ఇరాన్ తో అమెరికా యుద్ధం చేసేటట్టయితే... ఇరాన్ అమెరికన్ సైన్యంతో పాటుగా, అటు సౌదీపై కూడా దాడులు చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. బాగ్దాద్ లో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్ శక్తివంతమైన కమాండర్ సులేమానిని ని హతమార్చింది అమెరికా సైన్యం. అక్కడితో ఆగకుండా ఇరాక్ లోని తాజీ పట్టణంలో ఇరాన్ కు చెందిన వైద్య కాన్వాయ్ పై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్ రగిలిపోతుంది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
అయితే, ఇరాక్ లో ఉన్న అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే ఇరాన్ కు బుద్ధిచెప్తామనీ అంటోంది అమెరికా. రెండు దేశాల పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడికిపోతున్నది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!