యుఎస్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత..
- January 06, 2020
అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు భారత మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో 500 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ .. ఆ తరువాత 40, 764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12, 016 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు పతనమయ్యాయి. ఇరాన్ తో కయ్యానికి రెడీ అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అదే పనిలో పనిగా ఇరాక్ మీద కూడా ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. ఈ హెచ్చరిక ఎఫెక్ట్ వీటిపై పడింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ జనరల్ సోలిమని ఇరాక్ లో మృతి చెందడంతో అంతర్జాతీయంగా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. బంగారం ధర ఏడు నెలల గరిష్టానికి, క్రూడ్ ధర ఆరు నెలల గరిష్టానికి ఎగబాకాయి. అటు-దేశీయంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సెన్సెక్స్ సూచీలను కుదిపేయడం విశేషం. డాలర్ తో రూపాయి మారకం విలువ 31 పాయింట్లు తగ్గి.. 72. 10 గా కొనసాగింది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!