యుఎస్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత..
- January 06, 2020
అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు భారత మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో 500 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ .. ఆ తరువాత 40, 764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12, 016 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు పతనమయ్యాయి. ఇరాన్ తో కయ్యానికి రెడీ అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అదే పనిలో పనిగా ఇరాక్ మీద కూడా ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. ఈ హెచ్చరిక ఎఫెక్ట్ వీటిపై పడింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ జనరల్ సోలిమని ఇరాక్ లో మృతి చెందడంతో అంతర్జాతీయంగా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. బంగారం ధర ఏడు నెలల గరిష్టానికి, క్రూడ్ ధర ఆరు నెలల గరిష్టానికి ఎగబాకాయి. అటు-దేశీయంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సెన్సెక్స్ సూచీలను కుదిపేయడం విశేషం. డాలర్ తో రూపాయి మారకం విలువ 31 పాయింట్లు తగ్గి.. 72. 10 గా కొనసాగింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







