సులేమాని హత్యకు పరతీకారం తీర్చుకుంటా: కుద్స్ యొక్క కొత్త చీఫ్
- January 06, 2020

ఇరాన్: కద్స్ చీఫ్ జనరల్ సులేమాని ని అమెరికా దళాలు హతమొందించిన విషయం తెలిసిందే. సులేమాని మరణంతో ఇరాక్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. కుద్స్ యొక్క కొత్త చీఫ్ గా ఎస్మాయిల్ ఖానీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఇస్మాయిల్, అమెరికాపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ స్టేట్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
"అమరవీరుడు సులేమాని యొక్క మార్గాన్ని కొనసాగిస్తామని మేము వాగ్దానం చేస్తున్నాము, మరియు ఆ అమరవీరులకు ప్రతిగా ఈ ప్రాంతం నుండి అమెరికాను వెళ్లగొట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని కన్నీ చెప్పారు. ఈ విప్లవంలో కన్నీ తో కలిసి ముందడుగువేసేందుకు సిద్ధమయ్యారు సులైమాని కుమార్తె జైనాబ్. జైనాబ్ మాట్లాడుతూ "తన తండ్రి మరణానికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం..మిడిల్ ఈస్ట్ లో యుఎస్ సైనికుల కుటుంబాలు తమ పిల్లల మరణం కోసం ఎదురుచూస్తూ తమ రోజులు గడుపుతాయి" అన్నారు.
మరోవైపు ఇరాన్/ఇరాక్ చేస్తున్న ప్రతీకార వచనాలకు అమెరికా ఇలా స్పందించింది...అమెరికా దళాలకు వ్యతిరేకంగా టెహ్రాన్ ఏమైనా చర్యలు తీసుకుంటే, అమెరికా గురి పెట్టి ఉంచిన 52 లక్ష్యాలపై ఎటువంటి సంకోచం లేకుండా అధునాతన పరికరాలతో దాడి చేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో ప్రతిజ్ఞ చేశారు.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, టెహ్రాన్లోని ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సులేమాని కోసం జరిగిన రాష్ట్ర అంత్యక్రియల్లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు. హత్యకు ప్రతిస్పందనగా ప్రపంచ శక్తులతో 2015 అణు ఒప్పందం యొక్క మిగిలిన పరిమితులను కూడా వదిలివేసినట్లు టెహ్రాన్ తెలిపింది. ఇరాక్ పార్లమెంటు స్పందిస్తూ, అమెరికా దళాలను దేశం నుంచి తొలగించాలని ముక్తకంఠంతో ఓటు వేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







