300 పౌరుల తలలు కోసి వీధుల్లో పడేశారు!
- January 17, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరింతగా పెట్రేగిపోయారు. తాజాగా సిరియాలో రక్తపుటేరులు పారించారు. 300 మంది పౌరుల తలలు తెగ్గోసి.. వీధుల్లో పడేశారు. దీంతో సిరియాలోని దేరెల్ - ఇజార్ వీధులు శవాల గుట్టలుగా మారిపోయాయి. సిరియాలోని భూభాగాలపై పట్టుకోసమే ఈ నెత్తుటేరులు పారించారు. అంతేనా.. మరో 400 మంది సున్నీ తెగకు చెందిన ప్రజలను బందీలుగా చేసుకున్నారు. సిరియాలోని తూర్పుమధ్య నగరం దేరెల్-ఇజార్లో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక్కరోజే 300 మందికి పైగా పౌరులను ఊచకోత కోశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులుసహా కనిపించినవారినల్లా కత్తికి బలిపెట్టారు. బందీల తలలు నరికి నదిలోకి విసిరేశారు. ఉగ్రవాదుల నుంచి పట్టణాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన సైనికులను దారుణంగా వధించారు. ఎదురొడ్డిన వారి గుండెలపై గుండ్లవర్షం కురిపించారు. మరో 400 మంది పౌరులను బందీలుగా పట్టుకొన్నారు. దేరెల్-ఇజార్ ప్రాంతం ఉగ్రవాదుల పరంకాకుండా సిరియా సైన్యంతో పాటు మిలీషియా, పౌరులు సాయుధులై ఉగ్రవాదులతో తలపడ్డారు. దీంతో నగరంలోని ప్రతి వీధిలో భీకర పోరు దృశ్యాలు కనిపించాయి. ఊహించని ప్రతిఘటనతో ఉగ్రవాదులు తొలుత తత్తరపడ్డారు. ఆ వెంటనే ఉన్మాదులుగా మారి నేరుగా పౌరులపైకి రోజంతా విచ్చలవిడిగా కాల్పులు సాగించి నరమేధం సాగించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







