కేఫ్ ఫోటో వైరల్ కావడంతో నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై పిటిఐ సస్పెన్షన్

- January 14, 2020 , by Maagulf
కేఫ్ ఫోటో వైరల్ కావడంతో నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై పిటిఐ సస్పెన్షన్

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన అనారోగ్యానికి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక హామీతో లండన్ లో చికిత్సకు అంగీకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో చెక్కర్లు కొట్టేస్తోంది. అందులో నవాజ్ షరీఫ్ లండన్ లోని కేఫ్ లో ఇతర కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. దీంతో కంగు తిన్న పంజాబ్ ప్రభుత్వం అతని ఆరోగ్య సమస్యలపై విస్మయానికి గురైంది. పైగా ఇది PML-N విదేశీ చికిత్స యొక్క విస్తరణను కోరిన ప్రాంతీయ ప్రభుత్వానికి నేటి పరిస్థితి చాలా ఇబ్బందులను కలిగిస్తుందని ఆవేదన చెందుతోంది.

వైరల్ ఐన ఫొటోలో నవాజ్ షరీఫ్ కుమారుడు హసన్ నవాజ్, పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతని కుమారుడు సల్మాన్ షాబాజ్ మరియు మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తదితరులను చూడవచ్చు.

అయితే, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ నవాజ్ షరీఫ్ యొక్క తాజా వైద్య నివేదికను వైద్యుల నుండి కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com