తన భావోద్వేగాలను బయటపెట్టిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్
- January 14, 2020
పుల్లెల గోపిచంద్! ప్రముఖ జాతీయ బ్యాడ్మింటెన్ కోచ్! సైనానెహ్వాల్ , పీవీ సింధూలాంటి అద్భుతమైన ప్లేయర్లను తీర్చిదిద్దిన వ్యక్తి. సాధారణంగా ఆయన తన భావోద్వేగాలను బయటపెట్టరు. అలాంటిది ఇప్పుడు ఓ చేదు నిజాన్ని వెల్లడించారు. సైనా నెహ్వాల్ ..తన అకాడమినీ వీడటం కలిచివేసిందన్నారు. ఈ విషయంలో గురువు ప్రకాష్ పదుకునే.. కనీసం సైనాతో తన గురించి సానుకూలంగా మాట్లాడకలేకపోవడం బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోపీచంద్పై ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ బోరియా మజుందార్ డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్ అనే పుస్తకం రాస్తున్నారు. ఈ సందర్భంగా.. సైనా నెహ్వాల్ వివాదాన్ని మజుందార్తో పంచుకున్నారు గోపిచంద్.
2014లో సైనానెహ్వాల్ తన అకాడమీని వీడుతుంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్లు అనిపించిందని.. ఆమెను వెళ్లొద్దని అప్పటికే చాలాసార్లు బతిమిలాడినట్లు తెలిపారు. ఇతరుల ప్రభావంతో అకాడమీ వీడేందుకే సైనా నిర్ణయించుకుందని, దీంతో తాను ఆపలేకపోయానన్నారు. సైనా వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలిసినా అదే సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. పీవీ సింధూ 2012-14లో అత్యుత్తమంగా రాణించినా.. తానెప్పుడు సైనా నెహ్వాల్ను విస్మరించలేదన్నారు గోపిచంద్. ఈ విషయాన్ని ఆమెకు సరిగ్గా చెప్పలేకపోయినట్లు తెలిపారు. అయితే తాను రోల్ మోడల్గా భావించే ప్రకాశ్ పదుకునే.. సైతం సైనాతో మాట్లాడలేదన్నారు. పైగా సైనానీ హైదరాబాద్ వీడమని ఆయనే బలవంతం చేసినట్లు తెలిపారు. ప్రకాష్ సర్ తన గురించి ఎందుకు సైనాతో చర్చించలేదో ఇప్పటికీ అర్థంకాని విషయంగా మిలిగిపోయిందంటూ చెప్పుకొచ్చారు గోపిచంద్.
సైనా గోపిచంద్ అకాడమీ వీడాక… 2016లో రియో ఒలింపిక్స్లో ఘోరంగా ఒడిపోయింది. తొలిరౌండ్లోనే ఆమె ఇంటి ముఖం పట్టింది. సైనా జీవితంలో అవి గడ్డురోజులు. 2016 ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే వెనుతిరిగింది. దీని వల్ల కొన్నేళ్ల సాధన వృథా అయిందని, ఆ సమయంలో గోపీ సర్ సైనాతో లేరన్నాడు ఆమె భర్త పారుపల్లికశ్యప్. ఆ తర్వాత గాయమై సర్జరీ చేయించున్న సైనాకు…. అప్పుడేం చేయాలో అర్థమయ్యేది కాదన్నాడు. 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం గెలిచాక.. గోపి సర్ వద్ద వెళ్లి క్షమాపణ చెప్పాలని అనుకుందంటూ.. నాటి సంగతులను వివరించాడు కశ్యప్. ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ పబ్లికేషన్స్ ఈ నెల 20న మార్కెట్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి