డార్లింగ్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్
- January 16, 2020తెలుగు వారి పెద్ద పండుగ జనవరి 16 కనుమతో ముగుస్తుంది. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ సంక్రాంతిని మరో రోజు పొడిగించాడు. అవును, అసలు మేటర్ ఏంటంటే.. ప్రభాస్ 'సాహో' తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మూవీ టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నారు.
చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ 'జాన్' మూవీపై అప్డేట్ ఇవ్వాలంటూ డార్లింగ్ను కోరుతున్నారు. సంక్రాంతి పండుగను పొడిగిస్తూ ప్రభాస్ రేపు (జనవరి 17) తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రేపు డార్లింగ్ 20వ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్