డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజిమెంట్ కోటా
- January 22, 2020
హైదరాబాద్:డిగ్రీ విద్యలో మార్పులు తీసుకొస్తూ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంజినీరింగ్లో మాదిరిగానే ఇకపై డిగ్రీలో కూడా మేనేజిమెంట్ కోటా అమలు కానుంది. ఈ జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం(2020-21) మొదలు కానుండగా.. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజిమెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
గతేడాదే ఈ ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు మండలి ముందు ఉంచిన సంగతి తెలిసిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం నుంచి మేనేజిమెంట్ కోటా అమలు కానుండటంతో 30 శాతం సీట్లు యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతులు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు.
ఇకపోతే 100 శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లు, కొత్త కోర్సులకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అటు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో భాషా సబ్జెక్టులను ఇకపై మూడేళ్లు కాకుండా రెండేళ్లు చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి







