మొబైల్ రీచార్జ్ అడిగినందుకు భార్యను కొట్టి చంపిన భర్త
- January 22, 2020
అజ్మాన్: మొబైల్ రీచార్జ్ కార్డ్ అడిగిన భార్యను కొట్టి చంపాడో భర్త. ఇద్దరి మధ్యా మొబైల్ రీచార్జ్ విషయమై గొడవ జరగ్గా, సహనం కోల్పోయిన భర్త, తన చేతిలో వున్న కర్రతో భార్య తల మీద గట్టిగా కొట్టడంతో 49 ఏళ్ళ భార్య మృతి చెందింది. కాగా, 58 ఏళ్ళ వయసున్న భర్త, తాను ప్రార్థన చేస్తున్న సమయంలో తన భార్య తన మీద రీచార్జ్ విషయమై ఒత్తిడి తెచ్చిందనీ, దాంతో తాను ఆమెను కోపంతో కొట్టిన మాట వాస్తవమేగానీ, చంపాలనుకోలేదని విచారణలో చెప్పాడు. కర్రతో కొట్టిన తర్వాత ఆమె అక్కడే వుండిపోయిందనీ, తాను బయటకు వెళ్ళి రీచార్జ్ కార్డ్ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేందుకు ప్రయత్నించాననీ, అయితే ఆమె మళ్ళీ లేవలేదని చెప్పాడు నిందితుడు. తలలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







