మొబైల్ రీచార్జ్ అడిగినందుకు భార్యను కొట్టి చంపిన భర్త
- January 22, 2020
అజ్మాన్: మొబైల్ రీచార్జ్ కార్డ్ అడిగిన భార్యను కొట్టి చంపాడో భర్త. ఇద్దరి మధ్యా మొబైల్ రీచార్జ్ విషయమై గొడవ జరగ్గా, సహనం కోల్పోయిన భర్త, తన చేతిలో వున్న కర్రతో భార్య తల మీద గట్టిగా కొట్టడంతో 49 ఏళ్ళ భార్య మృతి చెందింది. కాగా, 58 ఏళ్ళ వయసున్న భర్త, తాను ప్రార్థన చేస్తున్న సమయంలో తన భార్య తన మీద రీచార్జ్ విషయమై ఒత్తిడి తెచ్చిందనీ, దాంతో తాను ఆమెను కోపంతో కొట్టిన మాట వాస్తవమేగానీ, చంపాలనుకోలేదని విచారణలో చెప్పాడు. కర్రతో కొట్టిన తర్వాత ఆమె అక్కడే వుండిపోయిందనీ, తాను బయటకు వెళ్ళి రీచార్జ్ కార్డ్ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేందుకు ప్రయత్నించాననీ, అయితే ఆమె మళ్ళీ లేవలేదని చెప్పాడు నిందితుడు. తలలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







