దుబాయ్ కూలింగ్ ఛార్జీలు యధాతథం

- January 18, 2016 , by Maagulf
దుబాయ్ కూలింగ్ ఛార్జీలు యధాతథం

దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ (దెవా), కూలింగ్‌ చార్జీల పెంపు లేదని ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో ఛార్జీల పెంపు జరగలేదని దెవా స్పష్టం చేసింది. దెవా సిఇఓ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ కంపెనీల సామర్థ్యాన్ని పెంచేందుకు సుప్రీం కౌన్సిల్‌ పలు చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్స్‌తో పోల్చితే కూలింగ్‌ కంపెనీలు 40 నుంచి 50 శాతం తక్కువ ఎనర్జీని వినియోగించుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల సంక్షోభం ఉన్నప్పటికీ ఆ ప్రభావం కూలింగ్‌ కంపెనీలపై ఉండదనీ, వినియోగదారులకూ కూలింగ్‌ ఛార్జీల పెంపు ఉండదన్నారు. జనవరి 1, 2011 నుంచి వలసదారులు 6.5 ఫిల్స్‌ పవర్‌ కోసం, 0.6 ఫిల్స్‌ నీటి కోసం వెచ్చిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com