మస్కట్:2020 టూర్ ఆఫ్ ఒమన్ రద్దు
- January 24, 2020
ఫిబ్రవరిలో జరగాల్సిన 2020 టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు చేస్తున్నట్లు రేస్ నిర్వాహక సంస్థ అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్-ASO ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం టూర్ ఆఫ్ ఒమన్ 11వ ఎడిషన్ వచ్చే నెల 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. అయితే..ఫిబ్రవరి 21 వరకు ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ సంతాప దినాలు ఉండటంతో రేస్ రద్దు చేస్తున్నట్లు ASO తెలిపింది. 2010 నుంచి అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ వస్తోంది. క్రిస్ ఫ్రూమ్, విన్సెంజో నిబాలితో లాంటి స్టార్ జీసీ రైడర్స్ పార్టిసిపేషన్ తో టూర్ ఆఫ్ ఒమన్ కు ఇటీవలి కాలంలో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. కజఖ్ అలెక్సీ లుట్సెంకో 9, 10వ ఎడిషన్ విజేతగా నిలిచారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









