మీ పిల్లల చివరి చూపునకు రండి: నిర్భయ దోషుల కుటుంబీకులకు సమాచారం పంపిన జైలు అధికారులు
- January 24, 2020నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి.
ఇలా ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. 'మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి' అని ఆనవాయితీ ప్రకారం పిలుపు పంపారు. అంతకు ముందు.. దోషుల చివరి కోరికను అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. నిర్భయ కేసు దోషుల కుటుంబీకులు వారి పిల్లలను చూసుకునేందుకు జైలుకు వెళ్తారా? అసలు వారి ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు జైలులో ఉన్న ఆ నలుగురి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అన్నది.. అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ భావోద్వేగాల సంగతి ఎలా ఉన్నా.. ఆ నలుగురు దోషుల ఉరి తీత మాత్రం ఖాయం. ఈ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కారాగారంలో దోషులు ఎలా ఉన్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నది నిరంతరం కనిపెడుతూ ఉన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..