నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రత తప్పనిసరి
- January 19, 2016
నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి దుబాయ్ మున్సిపాలిటీ స్పష్టమైన నిబంధనల్ని పేర్కొంది. మార్చ్ 1 లోగా అన్ని నిర్మాణ సంస్థలూ నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని హుకూం జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంతో నిర్మాణ ప్రాంతాలకు పక్కనే ఉన్న ఇళ్ళులోనివారు దోమలతో, ఎలుకలతో అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు చెప్పారు. నిర్మాణ ప్రాంతాల్లో ముందుగా దోమలు, ఈగల నివారణ కోసం మందులు చల్లవలసి ఉంటుందనీ, అలాగే ఎలుకలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే కార్మికుల భద్రత కోసం అన్ని మెజర్మెంట్స్ పాలించాలని అన్నారు. రెండు మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుతో ఫెన్సింగ్ని ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మించాలని నిబంధనలు చెబుతున్నట్లు వెల్లడించారు అధికారులు. నిర్మాణ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చవలసి ఉంటుందనీ, వాటిని కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటందని అధికారులు వివరించారు. నిర్మాణం సందర్భంగా వ్యర్ధాల్ని పారవేయవలసి ఉంటే, తగిన పద్ధతుల్లోనే వాటిని తరలించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







