నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రత తప్పనిసరి
- January 19, 2016
నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి దుబాయ్ మున్సిపాలిటీ స్పష్టమైన నిబంధనల్ని పేర్కొంది. మార్చ్ 1 లోగా అన్ని నిర్మాణ సంస్థలూ నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని హుకూం జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంతో నిర్మాణ ప్రాంతాలకు పక్కనే ఉన్న ఇళ్ళులోనివారు దోమలతో, ఎలుకలతో అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు చెప్పారు. నిర్మాణ ప్రాంతాల్లో ముందుగా దోమలు, ఈగల నివారణ కోసం మందులు చల్లవలసి ఉంటుందనీ, అలాగే ఎలుకలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే కార్మికుల భద్రత కోసం అన్ని మెజర్మెంట్స్ పాలించాలని అన్నారు. రెండు మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుతో ఫెన్సింగ్ని ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మించాలని నిబంధనలు చెబుతున్నట్లు వెల్లడించారు అధికారులు. నిర్మాణ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చవలసి ఉంటుందనీ, వాటిని కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటందని అధికారులు వివరించారు. నిర్మాణం సందర్భంగా వ్యర్ధాల్ని పారవేయవలసి ఉంటే, తగిన పద్ధతుల్లోనే వాటిని తరలించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









