మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... బస్సు టైరు పేలడంతో 20 మంది జలసమాధి...!
- January 29, 2020
ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అతి వేగం కారణంగా, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో బస్సు టైరు పేలి బస్సు అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయినట్టు సమాచారం. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టడంతో బస్సు వేగంగా వెళ్లి బావిలో పడింది. బస్సు టైరు పేలిపోవడం వలనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బస్సు బావిలో పడటంతో బస్సులో నుండి బయటకు రాలేక ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బస్సు టైరు పేలడం వలనే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. నాసిక్ లోని మాలేగావ్ నుండి కల్వాన్ కు బయలుదేరిన బస్సుకు ఈ ప్రమాదం జరిగింది.. బస్సు టైరు పేలి ఆటోను ఢీ కొట్టడంతో 70 అడుగుల లోతు ఉన్న బావిలో బస్సు పడిపోయింది.బస్సు బావిలో పడిపోవడంతో సహాయక చర్యల విషయంలో కొంత ఆటంకం కలుగుతోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







