యూఏఈ లో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు
- January 29, 2020
యూఏఈ: చైనా నగరమైన వుహాన్ నుండి యూఏఈ వచ్చిన కుటుంబ సభ్యులలో కరోనావైరస్ గుర్తించినట్టు పైగా ఇది యూఏఈ యొక్క మొదటి కరోనా వైరస్ కేసు గా ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మోహాప్ ప్రకటించింది.
బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "వైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది మరియు వారు ప్రస్తుతం వైద్య పరిశీలనలో ఉన్నారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోగ్య అధికారులు మరియు దేశంలోని సంబంధిత అధికారుల సమన్వయంతో, "ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన శాస్త్రీయ సిఫార్సులు, షరతులు మరియు ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు" తీసుకున్నట్లు MoHAP ధృవీకరించింది.
వైరస్ యొక్క ఏవైనా కేసులను ముందస్తుగా నివేదించడానికి దేశంలోని ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు కేంద్రాలు 24*7 పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది, దేశంలో ఆరోగ్య వ్యవస్థ "చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని మరియు మంత్రిత్వ శాఖ పరిస్థితిని దగ్గరగా అనుసరిస్తోందని పేర్కొంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







