యూఏఈ లో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు
- January 29, 2020
యూఏఈ: చైనా నగరమైన వుహాన్ నుండి యూఏఈ వచ్చిన కుటుంబ సభ్యులలో కరోనావైరస్ గుర్తించినట్టు పైగా ఇది యూఏఈ యొక్క మొదటి కరోనా వైరస్ కేసు గా ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మోహాప్ ప్రకటించింది.
బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "వైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది మరియు వారు ప్రస్తుతం వైద్య పరిశీలనలో ఉన్నారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోగ్య అధికారులు మరియు దేశంలోని సంబంధిత అధికారుల సమన్వయంతో, "ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన శాస్త్రీయ సిఫార్సులు, షరతులు మరియు ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు" తీసుకున్నట్లు MoHAP ధృవీకరించింది.
వైరస్ యొక్క ఏవైనా కేసులను ముందస్తుగా నివేదించడానికి దేశంలోని ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు కేంద్రాలు 24*7 పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది, దేశంలో ఆరోగ్య వ్యవస్థ "చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని మరియు మంత్రిత్వ శాఖ పరిస్థితిని దగ్గరగా అనుసరిస్తోందని పేర్కొంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







