భారత్ లో పర్యటించనున్న ట్రంప్

- January 29, 2020 , by Maagulf
భారత్ లో పర్యటించనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెల చివరి వారంలో భారత్‌లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఢిల్లీలో ట్రంప్ బస చేసేందుకు హోటల్ బుకింగ్స్, ఇతర కార్యక్రమాల విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ భారత పర్యటనకు ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరిగే అవకాశముంది.

ఇందు కోసం అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్ లైతిజర్ ఫిబ్రవరి రెండో వారంలో భారత పర్యటనకు రానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ వీరిద్దరూ విడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. రాబర్ట్ లైతిజర్ భారత పర్యటన తర్వాత ఫిబ్రవరి చివర్లో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పలు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ట్రంప్ పర్యటన జరుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com