భారత్ లో పర్యటించనున్న ట్రంప్
- January 29, 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెల చివరి వారంలో భారత్లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఢిల్లీలో ట్రంప్ బస చేసేందుకు హోటల్ బుకింగ్స్, ఇతర కార్యక్రమాల విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ భారత పర్యటనకు ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరిగే అవకాశముంది.
ఇందు కోసం అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్ లైతిజర్ ఫిబ్రవరి రెండో వారంలో భారత పర్యటనకు రానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ వీరిద్దరూ విడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. రాబర్ట్ లైతిజర్ భారత పర్యటన తర్వాత ఫిబ్రవరి చివర్లో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పలు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ట్రంప్ పర్యటన జరుగనుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







