భారత్ లో పర్యటించనున్న ట్రంప్
- January 29, 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెల చివరి వారంలో భారత్లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఢిల్లీలో ట్రంప్ బస చేసేందుకు హోటల్ బుకింగ్స్, ఇతర కార్యక్రమాల విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ భారత పర్యటనకు ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరిగే అవకాశముంది.
ఇందు కోసం అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్ లైతిజర్ ఫిబ్రవరి రెండో వారంలో భారత పర్యటనకు రానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ వీరిద్దరూ విడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. రాబర్ట్ లైతిజర్ భారత పర్యటన తర్వాత ఫిబ్రవరి చివర్లో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పలు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ట్రంప్ పర్యటన జరుగనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







